యూఏఈ అమరవీరుల్ని స్మరించుకున్న షేక్ మొహమ్మద్
- November 29, 2016
యూఏఈ కమ్మెమరేషన్ డే సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల్ని స్మరించుకున్నారు. సివిల్, మిలిటరీ, హ్యుమానిటేరియన్ విభాగాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి ఈ సందర్బంగా షేక్ మొహమ్మద్ ఘన నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీన అమరవీరుల త్యాగాల్నీ, వారి ధైర్య సాహసాల్ని గుర్తు చేసుకుంటూ కమ్మెమరేషన్ డే నిర్వహించుకోవడం జరుగుతోంది. యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన వివిధ విభాగాల్ని, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్నీ ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అభినందించారు. అమరవీరుల వారసులుగా మనల్ని మనం గొప్పగా చెప్పుకునే రోజు ఇదనీ, ప్రతి ఒక్కరూ దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని షేక్ మొహమ్మద్ చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







