ఉప్పుతో కలిగే ముప్పు
- September 01, 2015
కూరలో కొంచెం ఉప్పు ఎక్కువయినా కూడా ఆ కూర నాలుకకి రుచించదు. కానీ నిజానికి మనం ఎంత ఉప్పు తీసుకోవాలన్నది మనం నాలుకకి చేసే అలవాటుని బట్టి ఉంటుందట. జిహ్మకో రుచి అన్నట్టుగా మనకు తెలీకుండానే కావాలిన దానికన్నా ఎక్కువ మోతాదులో మనం ఉప్పు తినేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. మన జీవితంలో ప్రతిరోజూ 5 నుంచి 6 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలట. అంటే ఒక చెంచా ఉప్పు ఈ మోతాదుకు సరిపోతుందన్న మాట. ఉప్పు అధికంగా తీసుకుంటే బీపీ ఎక్కువవుతుందనే విషయం తెలిసిందే. అంతేకాకుండా హైబీపీతో పాటు జీర్ణాశయం లోపల జిగురు పొర దెబ్బ తినడంతో జీర్ణ కోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మాంసకృత్తులు లోపించిన చిన్నపిల్లలు, గర్భిణుల్లో ఉప్పు ఎక్కువగా వాడడం వల్ల పాదాల్లో నీరు చేరడంలాంటివి, ఒళ్లు ఉబ్బడం లాంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఉప్పు వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగని ఉప్పు మొత్తం తగ్గించేయ్యడం కూడా మంచిది కాదు. శరీరం తగిన మోతాదులో అందే సోడియం ఉప్పు నుండి లభిస్తుంది. ఒంట్లో సోడియం తగ్గితే విపరీతమైన అలసట, నిస్సత్తువ, చికాకు వికారం, పరధ్యానంలాంటి మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. అందుకే మితంగా ఉపయోగించాలి. అతిగా ఉపయోగించకూడదు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







