నగదు రహిత వ్యవస్థలో కీలకంగా మారనున్న 'ఆధార్'
- December 01, 2016
మీ ఆధార్ కార్డు మీద 12 అంకెల సంఖ్య త్వరలో నగదు రహిత వ్యవస్థలో కీలకంగా మారనుంది. ఆధార్తో జరిగే లావాదేవీలు కార్డ్లెస్, పిన్ లెస్గా వుంటాయని యూఐడీఏఐ డైరెక్టర్ జనరల్ అజయ్పాండే తెలిపారు. ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోనువాడకం దారులు ఫింగర్ ప్రింట్, ఐరిస్ ఆధారంగా ఆర్థిక లావాదేవీలు జరిగే విధంగా రూపకల్పన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే భారత్లో తయారుచేసే మొబైల్ కంపెనీలు ఐరిస్, ఫింగర్ ప్రింట్ను గుర్తించే విధంగా తయారుచేయమని సూచించినట్టు నీతిఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ చెప్పారు. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా వ్యాపార,వాణిజ్య సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా వున్న చిన్న వ్యాపారస్థులకు కూడా పలు రాయితీలు ఇస్తున్నట్టు ఐటీ శాఖ కార్యదర్శి అరుణాసుందరరాజన్ వెల్లడించారు. డిజిటల్ చెల్లింపులపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు పలు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







