నగదు రహిత వ్యవస్థలో కీలకంగా మారనున్న 'ఆధార్'
- December 01, 2016
మీ ఆధార్ కార్డు మీద 12 అంకెల సంఖ్య త్వరలో నగదు రహిత వ్యవస్థలో కీలకంగా మారనుంది. ఆధార్తో జరిగే లావాదేవీలు కార్డ్లెస్, పిన్ లెస్గా వుంటాయని యూఐడీఏఐ డైరెక్టర్ జనరల్ అజయ్పాండే తెలిపారు. ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోనువాడకం దారులు ఫింగర్ ప్రింట్, ఐరిస్ ఆధారంగా ఆర్థిక లావాదేవీలు జరిగే విధంగా రూపకల్పన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే భారత్లో తయారుచేసే మొబైల్ కంపెనీలు ఐరిస్, ఫింగర్ ప్రింట్ను గుర్తించే విధంగా తయారుచేయమని సూచించినట్టు నీతిఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ చెప్పారు. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా వ్యాపార,వాణిజ్య సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా వున్న చిన్న వ్యాపారస్థులకు కూడా పలు రాయితీలు ఇస్తున్నట్టు ఐటీ శాఖ కార్యదర్శి అరుణాసుందరరాజన్ వెల్లడించారు. డిజిటల్ చెల్లింపులపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు పలు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









