స్వల్పంగా పడిన పసిడి ధర

- September 02, 2015 , by Maagulf
స్వల్పంగా పడిన పసిడి ధర

మూడు రోజులుగా పైపైకి పోతున్న బంగారం ధర ఈ రోజు స్వల్పంగా తగ్గింది. మంగళవారం రూ.27,000మార్కును చేరిన బంగారం ధర ఈ రోజు రూ.60 తగ్గింది. కీలక సమయాల్లో కొనుగోలుదారుల నుంచి మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా ఈ లోహం ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.2శాతం తగ్గి 1,138 అమెరికన్‌ డాలర్లకు చేరింది.ఈ రోజు బంగారం దారిలోనే వెండి సైతం పయనించింది. రూ.150 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.35,000కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో ఈ లోహం ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.5శాతం తగ్గి 14.54 అమెరికన్‌ డాలర్లకు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com