స్వల్పంగా పడిన పసిడి ధర
- September 02, 2015
మూడు రోజులుగా పైపైకి పోతున్న బంగారం ధర ఈ రోజు స్వల్పంగా తగ్గింది. మంగళవారం రూ.27,000మార్కును చేరిన బంగారం ధర ఈ రోజు రూ.60 తగ్గింది. కీలక సమయాల్లో కొనుగోలుదారుల నుంచి మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా ఈ లోహం ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.2శాతం తగ్గి 1,138 అమెరికన్ డాలర్లకు చేరింది.ఈ రోజు బంగారం దారిలోనే వెండి సైతం పయనించింది. రూ.150 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.35,000కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో ఈ లోహం ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.5శాతం తగ్గి 14.54 అమెరికన్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









