ఇరాక్ లో ఉగ్ర దాడి, 24 మంది మృతి
- December 03, 2016
ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. మోసుల్ పట్టణంలోని సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని శనివారం దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 24 మందిని హతమార్చినట్లు ప్రెస్ టీవీ వెల్లడించింది. కాగా.. శుక్రవారం ఖయ్యరా ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన రెండు కారు బాంబు దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడిన విషయం తెలిసిందే.
మోసుల్కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖయ్యరాను ఇరాకీ సేనలు ఆగస్టు చివర్లో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అనంతరం ఆపరేషన్ మోసుల్ను చేపట్టిన ఇరాకీ సేనలకు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతుంది. ప్రస్తుతం మోసుల్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోందని ఇరాక్కు చెందిన అల్మాడా ప్రెస్ వెబ్సైట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









