ముగిసిన 'అమ్మ' శకం
- December 05, 2016
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి.. పురచ్చితలైవి జయలలిత (68) ఇక లేరు.కోట్లాది అభిమానులను.. పార్టీ కార్యకర్తలను శోకసంద్రంలో ముంచుతూ మరలిరాని లోకాలకు తరలిపోయారు. మరి కొద్దిసేపటిలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జయలలిత తమిళనాడుకు ముఖ్యమంత్రి అయినప్పటికీ తెలుగువారికి ఎంతో సుపరిచితురాలు. అమ్మ స్థానంలో ఆమెకు నమ్మినబంటుగా ఉన్న మంత్రి పన్నీర్ సెల్వం మరికాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి ఆయన రాజ్భవన్లో గవర్నర్ విద్యాసాగర్ రావును కలుసుకునేందుకు వెళతారు.
‘అమ్మ బాగానే ఉన్నారు.. ‘ఇక పురచ్చితలైవి ఇంటికి వచ్చేస్తారు..’ అన్న ఆనందం కొన్ని గంటల వ్యవధిలోనే ఆవిరైపోవడంతో అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరయ్యారు. సరిగ్గా రెండున్నర నెలల క్రితం జయలలిత డీహైడ్రేషన్, తీవ్ర జ్వరంతో బాధపడుతూ సెప్టెంబరు 22న స్థానిక గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జయకు అమర్చిన కృత్రిమ శ్వాస పరికరాన్ని కూడా తొలగించడంతో త్వరలోనే ఆమె క్షేమంగా ఇంటికి చేరుకుంటారని అన్నాడీఎంకే నేతలు భావించారు. కానీ ఇంతలోనే చేదు వార్త వినాల్సివచ్చింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







