వ్యవస్థాపకుడి మృతి: ఒమన్ ఫ్యాషన్ స్టోర్ మూసివేత
- December 09, 2016
మస్కట్లోని డిజైనర్ ఫ్యాషన్ స్టోర్ని మూసివేశారు. సంస్థ వ్యవస్థాపకుడు జునైద్ జమ్షెడ్ పాకిస్తాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందడమే దీనికి కారణం. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ప్రమాదంలో 47 మంది మృతి చెందారు. పాప్ స్టార్ టర్న్డ్ ఇస్లామిక్ ప్రీచర్ జునైద్ జమ్షెడ్, ఈ విమానంలో ప్రయాణించి మృత్యువాత పడ్డారు. ఆయనతోపాటు ఆయన భార్య కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా జునైద్ పలు ఫ్యాషన్ స్టోర్స్ని కలిగి ఉన్నారు. ఊఏఈ, సౌదీ అరేబియా, యుకె, యుఎస్ఎ, కెనడా, ఒమన్ తదితర దేశాల్లో షాప్లను నిర్వహిస్తున్న జునైద్, ఆస్ట్రేలియాలో కూడా ఓ స్టోర్ని ప్రారంభించవలసి ఉంది. రువి, మస్కట్లో ఉన్న జునైద్ ఫ్యాషన్ స్టోర్స్ని మూసివేశారు. తమ సంస్థల వ్యవస్థాపకుడి మృత పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, స్టోర్స్ ముందు బోర్డ్లు పెట్టడమే కాకుండా, ఫేస్ బుక్ పేజ్లో కూడా తమ యజమానికి నివాళులర్పించారు. 52 ఏళ్ళ జమ్షెడ్ పాకిస్తాన్లో ప్రముఖ సింగర్. ఆ తరువాత ఆయన ఇస్లామిక్ ప్రీచర్గా మారారు. ఫ్యాషన్ డిజైనర్గా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించడం జరిగింది. లాహోర్లో యూనివర్సిటీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందారాయన. 2004లో ఫ్యాషన్ క్లాతింగ్ రేంజ్ని ప్రారంభించారు. మస్కట్లో తొలిసారిగా 2016లో ఫ్యాషన్ బ్రాండ్ ఔట్లెట్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









