కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...
- December 11, 2016
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి నైరోబి-నైవిషా హైవేపై పెట్రోల్ ట్యాంకర్ వాహనాలను ఢీకొట్టి పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక బస్సు సహా 10 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









