'ప్రవాసి ఎక్సలెన్స్' కు అమెరికా నుండి ఐదుగురి ఎంపిక
- December 11, 2016
డిసెంబర్ 18న హైదరాబాద్ లో అవార్డుల ప్రధానం
వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపర్చిన అమెరికా కు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయ (ఎన్నారై), భారత సంతతి (పిఐఓ) వ్యక్తులను వారి నైపుణ్యం, సామర్ద్యం పాటు మానవతా దృక్పథంతో వారు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016 కు ఎంపికయ్యారు.
కొయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసి మిత్ర మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో 18 డిసెంబర్ 2016 ఆదివారం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగే ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే (అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం) కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 26 మందికి ఈ అవార్డుల ప్రధానం జరుగుతుందని 'కోట' వ్యవస్థాపక అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలిపారు.
గ్లోబల్ క్యాన్సర్ అవేర్నెస్ కాంపేన్ కు గాను న్యూయార్క్ నివాసి జయశ్రీ తేలుకుంట్ల;
సైంటిస్ట్గా, లంగాణ ఉద్యమంలోఎన్నారైల పాత్రలో వ్యూహకర్తగా సేవలందించిన డాలస్ నివాసి డా. మోహన్ గోలి;
యంగ్ సాఫ్ట్వేర్ ఎంటర్ ప్రేనర్, ఫిలాంత్రపిస్ట్ గా సేవలందిస్తున్న అట్లాంటా నివాసి కిరణ్ రెడ్డి పాశం;
సైన్స్, ఇంజనీరింగ్, ఎంటర్ ప్రేనర్ గా సేవలందిస్తున్న వర్జీనియా నివాసి డా. పిబి రాంరెడ్డి;
సంగీతంలో సేవలందిస్తున్న కాలిఫోర్నియా నివాసి సాయి మనాప్రగడ ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016 లకు ఎంపికయ్యారు.
నామినేషన్లను ఈ అవార్డుల కమిటీ పరిశీలించింది: ప్రొ.ఆడప సత్యనారాయణ (చైర్), కట్ట కవిత (కో- చైర్), అరుణా నాయుడు నిమ్మగడ్డ (మెంబర్), డా.కె.స్వరూపా రెడ్డి (మెంబర్), నిజాం వెంకటేశం (మెంబర్), పి. సునీల్ కుమార్ రెడ్డి (మెంబర్)
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







