టాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్న అరవింద్ స్వామి
- December 13, 2016
దళపతి సినిమాలో చిన్న పాత్రలో వెండి తెరపై మెరుపులా మెరిశాడు.. ఇక రోజా సినిమాతో మంచి పాపులర్ అయ్యాడు... ముంబై సినిమాతో స్టార్ హీరో సమానంగా స్టార్ డమ్ తెచ్చుకున్న అరవింద్ అమ్మాయిల కలల హీరోగా మారాడు... కానీ అవకాశాలు లేక వెనుకబడిపోయాడు.. దీంతో అరవింద్ తన పంథా మార్చుకొని తనిఒరువన్ లో విలన్ గా నటించాడు.. ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు... హీరో కంటే కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.. కాగా తనిఒరువన్ సినిమాను తెలుగులో ధృవ గా రీమేక్ చేశారు... ఇటీవల రిలీజ్ అయిన ధృవ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. సిద్ధార్ద్ అభిమన్యుగా అరవింద్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుతున్నాయి. కాగా ఈ సినిమా రిలీజైన తర్వాత అరవింద్ స్వామికి తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుతున్నాయి. కేవలం 7 రోజుల్లోనే 15 క్రేజీ ప్రాజెక్ట్స్ అరవింద్ స్వామి తలుపుతట్టాయి. కాగా వీటిలో ఇప్పటికీ 3 సినిమాలకు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది... కాగా హీరో నుంచి విలన్ గా మారి క్రేజీ ఆఫర్స్ అందుకొంటున్న జగపతి బాబుకి ఇప్పుడు అరవింద్ స్వామి పోటీగా మారాడు అని ఫిల్మ్ నగర్ లో టాక్ గా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









