ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్న సూపర్స్టార్ మరియు మెగాస్టార్
- December 13, 2016
సూపర్స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఇద్దరూ సిల్వర్ స్క్రీన్పై ఒకేసారి మెరిస్తే వారి వారి అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా ఓ సూపర్ సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. త్వరలోనే ఈ సూపర్ ప్రైజ్ నిజం కాబోతోందని సమాచారం. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్తో 'రోబో 2.0' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. 2010లో విడుదలై సంచలన విజయం సాధించిన 'రోబో' చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో ప్రతినాయకుడుగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షరుకుమార్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈచిత్రంలోని ఓ కీలక పాత్రలో చిరంజీవి లేదా మహేష్ నటిస్తాడనే వార్తలు ఇటీవల వినిపించాయి. అయితే ఫైనల్గా మెగాస్టార్ నటించేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రం 'ఖైదీ నెం.150' చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రాన్ని వచ్చే ఏడాది జవనరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







