ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్న సూపర్స్టార్ మరియు మెగాస్టార్
- December 13, 2016
సూపర్స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఇద్దరూ సిల్వర్ స్క్రీన్పై ఒకేసారి మెరిస్తే వారి వారి అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా ఓ సూపర్ సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. త్వరలోనే ఈ సూపర్ ప్రైజ్ నిజం కాబోతోందని సమాచారం. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్తో 'రోబో 2.0' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. 2010లో విడుదలై సంచలన విజయం సాధించిన 'రోబో' చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో ప్రతినాయకుడుగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షరుకుమార్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈచిత్రంలోని ఓ కీలక పాత్రలో చిరంజీవి లేదా మహేష్ నటిస్తాడనే వార్తలు ఇటీవల వినిపించాయి. అయితే ఫైనల్గా మెగాస్టార్ నటించేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రం 'ఖైదీ నెం.150' చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రాన్ని వచ్చే ఏడాది జవనరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









