14 విమాన సర్వీసులు రద్దయ్యాయి...

- December 13, 2016 , by Maagulf
14 విమాన సర్వీసులు రద్దయ్యాయి...

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 14 విమాన సర్వీసులు మంగళవారం రద్దయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తుఫాను ప్రభావంతో చెన్నై, తిరుపతి విమానాశ్రయ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో శంషాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లే ఏడు, తిరుపతికి వెళ్లే 4, జైపూర్‌, విజయవాడ, రాజమండ్రికి వెళ్లే విమాన సర్వీసులు రద్దు చేశారు. ఆయా విమానాశ్రయాల్లో అనుకూల వాతావరణం ఏర్పడే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని విమానాశ్రయ సిబ్బంది అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com