ఇండియన్స్కి సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్పోర్ట్
- December 18, 2016
ఇండియన్స్కి సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్పోర్ట్
మస్కట్: సరికొత్త ఫీచర్లతో ఇ-పాస్పోర్ట్లు అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భారత పార్లమెంటులో కేంద్ర మంత్రి వికె సింగ్, ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఇ-పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్ నడుస్తోందని చెప్పారు. ఇ-పాస్పోర్ట్లో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. పాస్పోర్ట్ డేటా పేజ్లో ఏదైతే సమాచారం ఉంటుందో, ఆ సమాచారమంతా చిప్లో నిక్షిప్తమై ఉంటుంది. సరికొత్త భద్రతా ఫీచర్లతో ఈ ఇ-పాస్పోర్ట్లను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రం వెల్లడించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇ-పాస్పోర్ట్ మ్యాన్యుఫ్యాక్చురర్ ఎవరనేది తెలియనుంది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,17,37,358 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఒమన్లో 7,96,001 మంది నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









