రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.!
- December 19, 2016
రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. అన్ని రైళ్లలో ఆర్ఏసీ కోటాను పెంచాలని నిర్ణయించింది. జనవరి 16 నుంచి అన్ని రైళ్లలో అదనపు ఆర్ఏసీ కోటాను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. ఆర్ఏసీ విభాగంలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచుతూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో స్లీపర్ కోచ్లో ఐదు సైడ్లోయర్ బెర్తుల్లో పది మందికి, మూడో తరగతి ఏసీ కోచ్లో రెండు సైడ్ లోయర్ బెర్తుల్లో ఇద్దరిని, రెండో తరగతి ఏసీ కోచ్లో లోయర్ బెర్తులో మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించేవారు. తాజాగా ఆ సంఖ్యను పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
స్లీపర్ కోచ్, మూడో తరగతి ఏసీలో మరో రెండు లోయర్ బెర్తుల్లో ఆర్ఏసీ ప్రయాణికులు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. రెండో తరగతి ఏసీలో మరో లోయర్ బెర్తును ఆర్ఏసీ విభాగంలోకి చేర్చింది. గతంలో స్లీపర్, రెండో తరగతి, మూడో తరగతి ఏసీల్లో ఆర్ఏసీ కింద 18 మంది ప్రయాణించే వీలువుండగా, ప్రస్తుత నిర్ణయంతో అదనంగా మరో 10మంది ఆర్ఏసీ ప్రయాణికులకు ప్రయోజనం దక్కనుంది.
తాజా వార్తలు
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- 2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- యాత్రికులకు అత్యున్నత నాణ్యత గల సేవలు..!!
- సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్









