రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి మరొకరికి గాయాలు
- December 20, 2016
షార్జా: యూఏఈ మనీ ఎక్స్ఛేంజ్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ మృతి చెందిన ఘటన షార్జాలో చోటు చేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి మనీ ఎక్స్ఛేంజ్లోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనతో సెక్యూరిటీ గార్డ్ మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రేక్ వేయాల్సింది పోయి, యాక్సెలరేటర్పై డ్రైవర్ కాలు వేయడంతో కారు వాహనం అదుపు తప్పింది. ప్రమాద సమయంలో డ్రైవర్ పూర్తిగా డ్రైవింగ్ మీద దృష్టిపెట్టలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అదృష్టవశాత్తూ స్టాఫ్ ఎవరూ చనిపోవడంగానీ, గాయపడటంగానీ జరగలేదనీ, సెక్యూరిటీ గార్డ్ మృతి చెందడం అలాగే అటువైపుగా వెళుతున్న ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలవడం దురదృష్టకరమని యూఏఈ ఎక్స్ఛేంజ్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







