రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి మరొకరికి గాయాలు
- December 20, 2016
షార్జా: యూఏఈ మనీ ఎక్స్ఛేంజ్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ మృతి చెందిన ఘటన షార్జాలో చోటు చేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి మనీ ఎక్స్ఛేంజ్లోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనతో సెక్యూరిటీ గార్డ్ మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రేక్ వేయాల్సింది పోయి, యాక్సెలరేటర్పై డ్రైవర్ కాలు వేయడంతో కారు వాహనం అదుపు తప్పింది. ప్రమాద సమయంలో డ్రైవర్ పూర్తిగా డ్రైవింగ్ మీద దృష్టిపెట్టలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అదృష్టవశాత్తూ స్టాఫ్ ఎవరూ చనిపోవడంగానీ, గాయపడటంగానీ జరగలేదనీ, సెక్యూరిటీ గార్డ్ మృతి చెందడం అలాగే అటువైపుగా వెళుతున్న ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలవడం దురదృష్టకరమని యూఏఈ ఎక్స్ఛేంజ్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









