తేలియాడుతున్న మంచు గడ్డపై పియానో ప్రదర్శన!
- December 21, 2016
ఇటలీకి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు లుడోవికో ఇనోది, ఆర్కిటిక్ సముద్రంలో ఇచ్చిన ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సంగీత ప్రియులు అతని అద్భుత బాణీలకు మంత్రముగ్ధులైతే.. పర్యావరణవేత్తలను ఈ ప్రదర్శన ఆలోచనలో పడేసింది. ప్రదర్శనలో అంతర్లీనంగా మానవాళికి ముంచుకొస్తున్న ముప్పు గురించి చెప్పాడు ఇనోది. ఆర్కిటిక్ మహాసముద్రంలో తేలియాడుతున్న మంచు గడ్డపై పియానో వాయిస్తూ ఇచ్చిన ప్రదర్శనకు మంచి స్పందన వస్తోంది. ఆర్కిటిక్కు స్మృతిగీతం పేరుతో ఈ ప్రదర్శన సాగింది. ఇనోది ప్రత్యేకంగా దీనికోసమే ఈ ట్యూన్ను కంపోజ్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్ను గ్రీన్పీస్ సంస్థ స్పాన్సర్ చేసింది. ప్రపంచ నేతలూ ఆర్కిటిక్ వైపు ఓసారి చూడంటూ ఈ ప్రదర్శన ద్వారా పిలుపునిచ్చారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఊహించిన దానికన్నా వేగంగా ఆర్కిటిక్ కరిగిపోతోందని, ఇప్పటికైనా మేల్కోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఇచ్చారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







