220 మంది భారత మత్స్యకారులను విడిచిపెట్టిన పాకిస్తాన్
- December 25, 2016
పాక్ జైళ్లలో ఉన్న 220 మంది భారత మత్స్యకారులను ఆ దేశం ఆదివారంనాడు విడిచిపెట్టింది. పరస్పర సౌహార్ద్ర చర్యల్లో భాగంగా వీరిని ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో ఉగ్ర ఘటనలు, చొరబాట్లతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత మత్స్యకారుల విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించారన్న ఆరోపణలతో అరెస్టు చేసిన 220 మంది మత్స్యకారులను కరాచీలోని మలిర్ జైలు నుంచి విడుదల చేసి లాహోర్కు రైలులో తీసుకువెళ్లారు. అక్కడ వాగా సరిహద్దుల్లో భారత అధికారులకు వారిని అప్పగించినట్టు మలిర్ జైలు సూపరింటెండెంట్ హసన్ సెహ్టో తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







