220 మంది భారత మత్స్యకారులను విడిచిపెట్టిన పాకిస్తాన్
- December 25, 2016
పాక్ జైళ్లలో ఉన్న 220 మంది భారత మత్స్యకారులను ఆ దేశం ఆదివారంనాడు విడిచిపెట్టింది. పరస్పర సౌహార్ద్ర చర్యల్లో భాగంగా వీరిని ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో ఉగ్ర ఘటనలు, చొరబాట్లతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత మత్స్యకారుల విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించారన్న ఆరోపణలతో అరెస్టు చేసిన 220 మంది మత్స్యకారులను కరాచీలోని మలిర్ జైలు నుంచి విడుదల చేసి లాహోర్కు రైలులో తీసుకువెళ్లారు. అక్కడ వాగా సరిహద్దుల్లో భారత అధికారులకు వారిని అప్పగించినట్టు మలిర్ జైలు సూపరింటెండెంట్ హసన్ సెహ్టో తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









