బంగారం ధర అంచనాలకు చిక్కడం లేదు..
- December 27, 2016
డిసెంబరు 27: పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారం ధర చంచలంగా మారింది. పెద్ద నోట్లు రద్దు కాగానే నల్ల కుబేరులు క్వింటాళ్ల కొద్దీ బంగారం కొన్నారు. తమ నల్లధనాన్ని దాచుకోవడానికి అదే సురక్షిత మార్గంగా భావించారు. ఫలితంగా దేశీయంగా బంగారం ధర అమాంతం పెరిగింది. నల్లబజారులో తులం(పది గ్రాముల) ధర రూ.50 వేల వరకు వెళ్లింది. కానీ... నగదు అందుబాటులో లేకపోవడం, బంగారు కొనుగోళ్లపై నజర్, ఆంక్షల నేపథ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్లు పడిపోయాయి. దాంతో ఒక్కసారిగా బంగారం క్రేజ్ తుస్సుమంది.
కొనేవారు లేకుండా పోయారు. 24 కేరట్ల బంగారం తులం ధర ఏకంగా 28 వేలకంటే దిగువకు పడిపోయింది. మరోపక్క అమెరికా ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచింది. అంతర్జాతీయంగా బంగారం కన్నా అమెరికా సర్కారీ బాండ్లే లాభదాయకంగా మారడంతో బంగారం ధర మరింత పడింది.
సోమవారమే బంగారం ధర ఏకంగా రూ.250 మేరకు పడిపోయి...11నెలల కనిష్ఠానికి చేరింది. ఇక బంగారం పని అయిపోయిందని విశ్లేషణలు వచ్చాయి. అయితే... మంగళవారం ఢిల్లీ ధర ఒకేరోజు అమాంతం 450 రూపాయలు పెరిగింది. దీంతో... బంగారం ధర అంచనాలకు చిక్కడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







