బంగారం ధర అంచనాలకు చిక్కడం లేదు..
- December 27, 2016
డిసెంబరు 27: పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారం ధర చంచలంగా మారింది. పెద్ద నోట్లు రద్దు కాగానే నల్ల కుబేరులు క్వింటాళ్ల కొద్దీ బంగారం కొన్నారు. తమ నల్లధనాన్ని దాచుకోవడానికి అదే సురక్షిత మార్గంగా భావించారు. ఫలితంగా దేశీయంగా బంగారం ధర అమాంతం పెరిగింది. నల్లబజారులో తులం(పది గ్రాముల) ధర రూ.50 వేల వరకు వెళ్లింది. కానీ... నగదు అందుబాటులో లేకపోవడం, బంగారు కొనుగోళ్లపై నజర్, ఆంక్షల నేపథ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్లు పడిపోయాయి. దాంతో ఒక్కసారిగా బంగారం క్రేజ్ తుస్సుమంది.
కొనేవారు లేకుండా పోయారు. 24 కేరట్ల బంగారం తులం ధర ఏకంగా 28 వేలకంటే దిగువకు పడిపోయింది. మరోపక్క అమెరికా ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచింది. అంతర్జాతీయంగా బంగారం కన్నా అమెరికా సర్కారీ బాండ్లే లాభదాయకంగా మారడంతో బంగారం ధర మరింత పడింది.
సోమవారమే బంగారం ధర ఏకంగా రూ.250 మేరకు పడిపోయి...11నెలల కనిష్ఠానికి చేరింది. ఇక బంగారం పని అయిపోయిందని విశ్లేషణలు వచ్చాయి. అయితే... మంగళవారం ఢిల్లీ ధర ఒకేరోజు అమాంతం 450 రూపాయలు పెరిగింది. దీంతో... బంగారం ధర అంచనాలకు చిక్కడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









