బంగారం అక్రమ రవాణా...పట్టుకున్న కస్టమ్స్ అధికారులు..
- December 30, 2016
లో దుస్తుల్లో పెట్టుకొని బంగారం అక్రమ రవాణా చేస్తుండగా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్న సంఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగుచూసింది. 1.25 కిలోల బంగారు బిస్కెట్లను కస్టమ్స్, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాతనగరంలోని రెయిన్ బజార్ కుచెందిన అమేర్, ఫహద్, ఫసియుద్దీన్ లు స్నేహితులు. మూడునెలల క్రితం ఫహద్, ఫసీయుద్దీన్లు సౌదీకి వెళ్లారు.అమేర్ హైదరాబాద్ లో ఉండేవాడు. అమేర్ కూడా సౌదీకి వెళ్లి మరో ఇద్దరితో కలిసి వస్తూ అమేర్ బంగారం బిస్కెట్లు తీసుకువస్తూ అధికారులకు దొరికాడు. శుక్రవారం జెడ్డా విమానం దిగి ఎయిర్పోర్టు వెలుపలి కి వస్తున్న ప్రయాణికులను తనిఖీ చేయగా అమేర్ వద్ద ఒక కిలో 435 గ్రాముల బంగారం దొరికింది.
తన లోదుస్తు ల్లో బంగారం దాచుకొని తెస్తుండగా సోదాల్లో లభించిందని అధికారులు చెప్పారు. బంగారం స్వాధీనం చేసుకొని నింధితుడిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. జెడ్డా దేశం నుంచి వస్తున్న విమానం లో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నట్టు సమాచా రం అందడంతో కస్టమ్స్ అధికారులు, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఎయిర్పోర్టులో మాటువేసి నిందితులను పట్టుకున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







