మళ్ళీ లొల్లి మొదలెట్టిన ములాయం
- January 01, 2017
ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ రోజు పార్టీ కార్యవర్గ జాతీయ సదస్సు నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి మళ్లీ బహిష్కరించారు. అఖిలేష్ కు మద్దతు తెలిపిన పార్టీ సీనియర్ నేతలు నరేష్ అగర్వాల్, కిరణ్మయి నందాలపై కూడా వేటు వేశారు. ఈ నెల 5న జాతీయ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు ములాయం ప్రకటించారు.
యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్-రాంగోపాల్ యాదవ్, ములాయం-సోదరుడు శివపాల్ యాదవ్ గ్రూపులు పోటాపోటీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఎస్పీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా గ్రూపులు వారీగా విడిపోయారు. అఖిలేష్ గ్రూపు ఈ రోజు జాతీయ స్థాయ సమావేశం నిర్వహించి ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. యూపీ ఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న శివ్పాల్ యాదవ్ను పదవి నుంచి తొలగించి, ములాయంకు సన్నిహితుడైన అమర్సింగ్పై వేటు వేశారు. ఈ నేపథ్యంలో సోదరుడు రాంగోపాల్ పై వేటు వేసిన ములాయం.. కొడుకు అఖిలేష్ పై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. జాతీయ స్థాయి సమావేశానికి ములాయం పిలుపునివ్వడంతో ఎస్పీలో ఆధిపత్య పోరు తీవ్రమైంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







