టర్కీ లోని దాడిలో మృతిచెందిన ఇద్దరు భారతీయులు
- January 01, 2017
ఇస్తాంబుల్ ఉగ్రదాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందినట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మృతులు అబిస్ రిజ్వీ, గుజరాత్కు చెందిన ఖుషీ షాగా గుర్తించినట్లు చెప్పారు. అబిస్ రిజ్వీ రాజ్యసభ మాజీ సభ్యుడి కుమారుడిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. టర్కీలోని భారత రాయబారి ఇస్తాంబుల్ బయలుదేరినట్లు తెలిపారు.
టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్లో ఉగ్రవాది నరమేధం సృష్టించాడు. ఓ నైట్ క్లబ్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటున్న ప్రజలపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోగా 40మందికి పైగా గాయపడ్డారు. శాంతాక్లాజ్ దుస్తుల్లో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో నైట్ క్లబ్లో సుమారు 500 మంది ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







