టర్కీ లోని దాడిలో మృతిచెందిన ఇద్దరు భారతీయులు

- January 01, 2017 , by Maagulf
టర్కీ లోని దాడిలో మృతిచెందిన ఇద్దరు భారతీయులు

ఇస్తాంబుల్‌ ఉగ్రదాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందినట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మృతులు అబిస్‌ రిజ్వీ, గుజరాత్‌కు చెందిన ఖుషీ షాగా గుర్తించినట్లు చెప్పారు. అబిస్‌ రిజ్వీ రాజ్యసభ మాజీ సభ్యుడి కుమారుడిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. టర్కీలోని భారత రాయబారి ఇస్తాంబుల్‌ బయలుదేరినట్లు తెలిపారు.
టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో ఉగ్రవాది నరమేధం సృష్టించాడు. ఓ నైట్‌ క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటున్న ప్రజలపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 35 మంది ప్రాణాలు కోల్పోగా 40మందికి పైగా గాయపడ్డారు. శాంతాక్లాజ్‌ దుస్తుల్లో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో నైట్‌ క్లబ్‌లో సుమారు 500 మంది ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com