మొబిక్విక్తో ఒప్పందం కుదుర్చుకున్న ఎయిమ్స్
- January 03, 2017
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) దిల్లీ డిజిటల్ చెల్లింపుల సంస్థ మొబిక్విక్తో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా వైద్యులు, సిబ్బంది, రోగులు నగదు రహిత సేవలను పొందవచ్చు. 'ఎయిమ్స్లో చికిత్సలకు సంబంధించిన అన్ని చెల్లింపులు మొబిక్విక్ ద్వారా చెల్లించవచ్చు. వైద్యులు సంప్రదింపుల ఫీజు, పరీక్షలు, ఇతర సర్వీసులు నగదు రహితం కానున్నాయి. జనవరి తొలివారం నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది' అని మొబిక్విక్ ఓ ప్రకటనలో తెలిపింది. 'నగదు కొరత సమస్య ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులకు అండగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. భారత ఆర్థిక వ్యవస్థను నగదు రహితంగా మార్చేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ప్రఖ్యాత ఎయిమ్స్తో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది' అని మొబిక్విక్ సహ వ్యవస్థాపకులు ఉపాసన థాకూ తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







