కెప్టెన్సీకి గుడ్ బాయ్ చెప్పిన ధోని
- January 04, 2017
ఆల్టైమ్ గ్రేట్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని 2017 ఆరంభంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలు, టీ20లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే ఇంగ్లాండ్తో జరిగే వన్డే, టి20 సిరీస్లకు అందుబాటులో ఉంటాడని ధోని నిర్ణయాన్ని బీసీసీఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం టెస్ట్మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విరాట్కోహ్లినే వన్డేలు, టీ20 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ పేర్కొంది.
* 2007 సెప్టెంబరు నుంచి టీ20 మ్యాచ్లకు ధోని సారథ్యం వహించాడు. .
* 2007 సెస్టెంబరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్ నుంచి వన్డేలకు ధోని బాధ్యతలు చేపట్టాడు.
*జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహేంద్రసింగ్ ధోని 72 టీ20 మ్యాచ్లకు, 199 వన్డేలకు సారథ్య బాధ్యతలు వహించాడు.
* ధోని సారథ్యంలో 2009 డిసెంబరులో టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా నంబర్ వన్గా అవతరించింది.
* ధోని కెప్టెన్సీలో భారత్ జట్టు 2011లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సాధించింది.
* 2013 మార్చిలో విజయవంతమైన టెస్టు కెప్టెన్గా భారత్ తరఫున ధోనీ రికార్డు నమోదు చేశాడు.
* 49 టెస్టుల్లో 21 విజయాలు సాధించిన గంగులీ రికార్డును ధోని అధిగమించాడు.
* ఆల్టైమ్ గ్రేట్ క్రికెటర్గా ధోనిని ప్రముఖ క్రికెటర్లు కొనియాడారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







