అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో కొందరిని కలవనుకుంటున్న జుకర్బర్గ్
- January 04, 2017
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ సృష్టికర్త మార్క్ జుకర్బర్గ్ సరికొత్త సవాల్ విసిరారు. ఎవరికో కాదండోయ్.. తనకు తానే! ఏటా ఒక కొత్త సవాల్ (లక్ష్యం)ను పెట్టుకొని పూర్తిచేయడం ఆయనకు అలవాటు. 2017 పూర్తయ్యేలోగా అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో కొందరు వ్యక్తుల్ని వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకొన్నారు. గతంలో ఆయన స్వగృహానికి కృతిమ మేథస్సు ఏర్పాటు చేసుకోవడం, మాండరిన్ భాష నేర్చుకోవడం, 25 పుస్తకాలు చదవడం, 587 కిలోమీటర్లు పరుగెత్తడం వంటివి పెట్టుకొన్నారు. 'ఈ ఏడాది బయటకు వెళ్లి సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని నియమం పెట్టుకొన్నా. ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకుంటాను. ప్రపంచాన్నంతా అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి గొంతుకకు ప్రాధాన్యం ఇవ్వడం నా పని. ఈ ఏడాది వారి అభిప్రాయాల్ని వ్యక్తిగతంగా వింటాను. ఫేస్బుక్, చాన్ జుకర్బర్గ్ సంస్థలను సమర్థంగా నడిపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచం సరికొత్త యుగంలోకి అడుగిడుతున్న తరుణంలో ఇది సానుకూల ప్రభావం చూపుతుందని' జుకర్బర్గ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







