అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో కొందరిని కలవనుకుంటున్న జుకర్బర్గ్
- January 04, 2017
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ సృష్టికర్త మార్క్ జుకర్బర్గ్ సరికొత్త సవాల్ విసిరారు. ఎవరికో కాదండోయ్.. తనకు తానే! ఏటా ఒక కొత్త సవాల్ (లక్ష్యం)ను పెట్టుకొని పూర్తిచేయడం ఆయనకు అలవాటు. 2017 పూర్తయ్యేలోగా అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో కొందరు వ్యక్తుల్ని వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకొన్నారు. గతంలో ఆయన స్వగృహానికి కృతిమ మేథస్సు ఏర్పాటు చేసుకోవడం, మాండరిన్ భాష నేర్చుకోవడం, 25 పుస్తకాలు చదవడం, 587 కిలోమీటర్లు పరుగెత్తడం వంటివి పెట్టుకొన్నారు. 'ఈ ఏడాది బయటకు వెళ్లి సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని నియమం పెట్టుకొన్నా. ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకుంటాను. ప్రపంచాన్నంతా అనుసంధానం చేసి ప్రతి ఒక్కరి గొంతుకకు ప్రాధాన్యం ఇవ్వడం నా పని. ఈ ఏడాది వారి అభిప్రాయాల్ని వ్యక్తిగతంగా వింటాను. ఫేస్బుక్, చాన్ జుకర్బర్గ్ సంస్థలను సమర్థంగా నడిపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచం సరికొత్త యుగంలోకి అడుగిడుతున్న తరుణంలో ఇది సానుకూల ప్రభావం చూపుతుందని' జుకర్బర్గ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







