మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం వర్గంపై దాడులు

- January 06, 2017 , by Maagulf
మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం వర్గంపై దాడులు

అమ్మ ఒడిలో ఉండాల్సిన పదహారు నెలల చిన్నారి బురదలో ఇలా విగతజీవుడిగా పడి ఉండడాన్ని చూస్తే హృదయం కలచి వేస్తుంది.  చిన్నారి పేరు మహ్మద్ షొహాయత్.  మయన్మార్‌లోని రఖైన్ ప్రాంతంలో నివసిస్తున్న రోహింగ్యా వర్గానికి చెందిన జాఫర్ ఆలం కుమారుడు.  రోహింగ్యా ముస్లిం వర్గంపై జరుగుతున్న దాడుల నుంచి తప్పించుకునేందుకు ఆలం కుటుంబం పడవలో బంగ్లాదేశ్‌కు బయలు దేరడానికి సిద్దమైంది. విషయం తెలుసుకున్న మయన్మార్ పోలీసులు అక్కడికి చేరుకుని కాల్పులు ప్రారంభించారు.  బోటు నడిపేవారు కాల్పులనుంచి తప్పించుకునే తొందరలో శరణార్థులందరినీ ఎక్కించుకుని బయల్ధేరారు.  పరిమితికి మించిన బరువుతో బయల్ధేరిన పడవ గమ్యం చేరకముందే నాఫ్ నదిలో మునిగిపోయింది.  16 నెలల షొహాయత, అతడి తల్లి, మేనమామ, మూడేళ్ళ సోదరుడు ఈ ప్రమాదంలో అసువులు  బాశారు.  షొహాయత శరీరం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. కన్నబిడ్డలు, భార్య కళ్ళముందే విగతజీవులుగా పడివుండడాన్ని జీర్ణించుకోలేక ఆ కన్న తండ్రి హృదయవిదారకంగా రోదిస్తున్నాడు.  నేను మాత్రం ఎందుకు బతికి అని రోదిస్తున్నాడు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com