రిపబ్లిక్ డే కి రానున్న 'ఎస్3'
- January 07, 2017
హిట్ కాంబినేషన్ సూర్య - హరిల తాజా చిత్రం 'ఎస్3' అనుకున్నది సాధించింది. క్రిస్మస్కు విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో వాయిదాపడి రిపబ్లిక్ డే రోజున తెరపైకి రాబోతోంది. 'సింగం' తొలి రెండు భాగాలకు మించిన భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయి కథాంశంతో తెరకెక్కిన 'ఎస్3'కి సెన్సార్ బోర్డు 'యు/ఏ' ఇచ్చి షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ రివైజ్డ్ కమిటీకి వెళ్లింది. దర్శకుడు హరి సెన్సార్ బోర్డుతో పోరాడి మరీ యు సర్టిఫికెట్ సాధించారట. దీంతో 'ఎస్3' యూనిట్ ఆనందోహత్సాహాల్లో ఉంది. అనుకున్నది దక్కడంతో చిత్ర విజయంపై హరి ధీమాతో వున్నారు. సూర్య ఖాతాలో మరో బ్లాక్బ్లస్టర్ ఖాయమని ఆయన అభిమానులు ఆశాభావంతో వున్నారు. కాగా, ఈ చిత్రంలో సూర్యకు జోడీగా అనుష్క, శ్రుతిహాసన నటించగా, హారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. తమిళం, తెలుగు భాషల్లో ఒకేరోజు 'ఎస్3' తెరపైకి రానుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









