మానవ రవాణాపై 90 శాతం పైగా దుబాయ్ నివాసితులకు అవగాహన
- January 07, 2017
దుబాయ్ : మానవ రవాణా వివిధ రకాల తీరు గురించి చాలా పెద్ద మెజారిటీలో దుబాయ్ నివాసితులలో 94 శాతం మందికి పూర్తిగా లేదా పాక్షికంగా తెలుసునాని మరియు 79 శాతం మందికి ఆయా నేరాలపై పోరాడటానికి యుఎఇకి చెందిన చట్టాల గురించి పూర్తిగా అవగాహన ఉందని ఒక సర్వేలో వెల్లడైంది..అద్దర్ పరిశోధన మరియు పోల్ సెంటర్ సహకారంతో దుబాయ్ పోలీసులు నిర్వహించిన ఈ సర్వేలో, గతంలో జరిగిన ఘటనల గూర్చి మరియు మానవ రవాణా గూర్చి అవగాహనను ప్రజలు కల్గి ఉన్నారని అవసరమైతే ఏ స్థాయిలో నైనా పోరాటం జరిపి మానవ రవాణా జరగని రాష్ట్రంగా నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో దుబాయ్ నివాసితులు ఉన్నట్లు సర్వే వెల్లడించింది.దుబాయ్ పోలీసు మరియు జనరల్ సెక్యూరిటీ డిప్యూటీ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ దాహి ఖలీఫాన్ తమీమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ మహమ్మద్ అల్ ముర్, దుబాయ్ పోలీస్ నుండి సర్వే నివేదికను అందుకున్నారు.ఈ అధ్యయనం దుబాయ్ లోని సమాజంలోని పలు విభాగాలను సందర్శించి వివరాలు రాబట్టేరని జనరల్ డాక్టర్ అల్ మోర్ చెప్పారు. ఈ సర్వే ను ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంకు చెందిన ఉద్యోగులతో సహా అనేక రంగాల నుంచి 1,597 మందిని క్రమ రహితంగా ఎంచుకున్న నమూనాని స్పృశించారని తెలిపారు.
ఈ సర్వే నిర్వహించిన వారిలో 51 శాతం మంది సభ్యులు దుబాయ్ లో సాధారణ ప్రజలని, 18 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగుల గాని లేదా పౌర సమాజంతో అనుసంధానమైనవారని మరియు 31 శాతం మంది ప్రైవేట్ రంగంకు చెందినవారు ఉన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు









