పోర్చుగల్ ప్రధానితో భేటీ అయిన నరేంద్ర మోదీ
- January 07, 2017
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ దేశ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరు ఉన్న జెర్సీని ప్రధాని మోదీకి కోస్టా బహుకరించారు. శనివారం వీరిద్దరూ సమావేశమై ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలకమైన ఆరు ఒప్పందాలపై ఆయా దేశ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇందులో రక్షణ సహకార ఒప్పందం ఉంది. ఏడు రోజుల పాటు ఆంటోనియో భారత్లో పర్యటించనున్నారు. బెంగళూరులో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్కు రెండు రోజుల పాటు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. శనివారం పోర్చుగల్ ప్రధాని ఆంటోనియోకు రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల బృందం సైనిక వందనం సమర్పించింది. అనంతరం ఆయన రాజ్ఘాట్లోని మహాత్ముడి సమాధిని దర్శించుకొని నివాళులర్పించారు.
తాజా వార్తలు
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు









