పోర్చుగల్‌ ప్రధానితో భేటీ అయిన నరేంద్ర మోదీ

- January 07, 2017 , by Maagulf
పోర్చుగల్‌ ప్రధానితో భేటీ అయిన నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోర్చుగల్‌ ప్రధాని ఆంటోనియో కోస్టా ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ దేశ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరు ఉన్న జెర్సీని ప్రధాని మోదీకి కోస్టా బహుకరించారు. శనివారం వీరిద్దరూ సమావేశమై ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలకమైన ఆరు ఒప్పందాలపై ఆయా దేశ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇందులో రక్షణ సహకార ఒప్పందం ఉంది. ఏడు రోజుల పాటు ఆంటోనియో భారత్‌లో పర్యటించనున్నారు. బెంగళూరులో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్‌కు రెండు రోజుల పాటు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. శనివారం పోర్చుగల్‌ ప్రధాని ఆంటోనియోకు రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల బృందం సైనిక వందనం సమర్పించింది. అనంతరం ఆయన రాజ్‌ఘాట్‌లోని మహాత్ముడి సమాధిని దర్శించుకొని నివాళులర్పించారు.​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com