మరో రికార్డు సృష్టించిన నాసా వ్యోమగాములు.!
- January 07, 2017
నాసా వ్యోమగాములు మరో రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో ఏకదాటిగా ఆరు గంటలకుపైగా నడిచారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం వెలుపల కొత్త టవర్లను విజయవంతంగా ఏర్పాటు చేశారు. ఇప్పటి దాకా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో నికెల్-హైడ్రోజన్ బ్యాటరీలను వినియోగించేవారు. సోలార్ ప్యానెళ్లతో ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఆ బ్యాటరీల్లో నిల్వ చేసేవారు. వాటి స్థానంలో తక్కువ పరిమాణం.. అధిక సామర్థ్యం కలిగి ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలను ఏర్పాటు చేసేందుకు ఏడాదిగా కసరత్తులు చేసిన నాసా.. తాజాగా ఆ ప్రక్రియను పూర్తి చేసింది. ఇద్దరు వ్యోమగాములు కలిసి శనివారం ఆరు లిథియం-అయాన్ బ్యాటరీలను అమర్చారు. కొత్త కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ సాహస ప్రక్రియలో కమాండర్ షేన్ కిమ్బ్రాగ్.. ఫ్లైట్ ఇంజినీర్ పెగ్గీ విట్సన్ పాల్గొన్నారు. జనవరి 13న కిమ్బ్రాగ్తోపాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్లైట్ ఇంజినీర్ థామస్ పెస్క్వెట్ కలిసి మరోమారు స్పేస్వాక్ చేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







