అక్కడ సాయం చేస్తే రెండువేల రూపాయలు రివార్డు
- January 07, 2017
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన వాళ్లను ఇకపై దిల్లీ ప్రభుత్వం రివార్డు ఇచ్చి సత్కరించనుంది. ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చేర్పిస్తే వారికి రూ.2000 బహుమతిగా ఇచ్చే విధానానికి దిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రజల్లో సేవా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు బాధితులకు సహాయం చేయడాన్ని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ విధానాన్ని పెట్టినట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. అంతేకాదు సహాయం చేసిన వ్యక్తికి ప్రభుత్వం తరపు నుంచి ప్రశంసాపత్రాన్ని అందజేస్తామన్నారు. కళ్ల ముందు గాయాలతో ఉన్న వ్యక్తికి సహాయం చేయకుండా మనకెందుకులే అని వెళ్లిపోతున్న వారికి ఇదొక కనువిప్పు కావాలి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ రెండువేల రూపాయల రివార్డు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం









