అక్కడ సాయం చేస్తే రెండువేల రూపాయలు రివార్డు
- January 07, 2017
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన వాళ్లను ఇకపై దిల్లీ ప్రభుత్వం రివార్డు ఇచ్చి సత్కరించనుంది. ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చేర్పిస్తే వారికి రూ.2000 బహుమతిగా ఇచ్చే విధానానికి దిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రజల్లో సేవా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు బాధితులకు సహాయం చేయడాన్ని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ విధానాన్ని పెట్టినట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. అంతేకాదు సహాయం చేసిన వ్యక్తికి ప్రభుత్వం తరపు నుంచి ప్రశంసాపత్రాన్ని అందజేస్తామన్నారు. కళ్ల ముందు గాయాలతో ఉన్న వ్యక్తికి సహాయం చేయకుండా మనకెందుకులే అని వెళ్లిపోతున్న వారికి ఇదొక కనువిప్పు కావాలి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ రెండువేల రూపాయల రివార్డు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







