సినాయ్ లో ఉగ్రవాదుల ట్రక్ దాడి, 9 మంది పోలీసులు మృతి
- January 09, 2017
ఈజిప్టు సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఉత్తర సినాయ్ గవర్నరేట్లో చెత్త సేకరించే ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉంచి దానితో సెక్యూరిటీ చెక్పాయింట్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో కనీసం 9 మంది పోలీసులు మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. చెక్పాయింట్లోకి ట్రక్కుతో దూసుకుపోతూ ఉగ్రవాదులు కాల్పులు కూడా జరిపినట్టు పేర్కొన్నారు. అయితే ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. గాయపడిన 14 మందిలో నలుగురు పౌరులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. 2011 నుంచి ఇక్కడ ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడతున్నారు. తాజా దాడిలో 9 మంది పోలీసులు చనిపోయినట్టు చెబుతున్న కచ్చితమైన సంఖ్యను పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







