సినాయ్ లో ఉగ్రవాదుల ట్రక్ దాడి, 9 మంది పోలీసులు మృతి
- January 09, 2017
ఈజిప్టు సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఉత్తర సినాయ్ గవర్నరేట్లో చెత్త సేకరించే ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉంచి దానితో సెక్యూరిటీ చెక్పాయింట్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో కనీసం 9 మంది పోలీసులు మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. చెక్పాయింట్లోకి ట్రక్కుతో దూసుకుపోతూ ఉగ్రవాదులు కాల్పులు కూడా జరిపినట్టు పేర్కొన్నారు. అయితే ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. గాయపడిన 14 మందిలో నలుగురు పౌరులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. 2011 నుంచి ఇక్కడ ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడతున్నారు. తాజా దాడిలో 9 మంది పోలీసులు చనిపోయినట్టు చెబుతున్న కచ్చితమైన సంఖ్యను పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







