వేంకటేశా...అది అబద్ధం కావాలి....
- January 09, 2017
ఓం నమో వెంకటేశాయా మూవీ చేస్తున్నప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇదే నా ఆఖరి సినిమా కావచ్చునని అనేవారని, కానీ ఆ మాట అబద్ధం కావాలని అన్నాడు నాగార్జున. వెంకటేశుడ్ని ఇదే కోరుకుంటున్నా అని పేర్కొన్నాడు. రాఘవేంద్ర రావుతో తానిలా సినిమాలు చేస్తూనే ఉండాలన్నాడు.
ఓం నమో వేంకటేశాయ మూవీ ఆడియో ఆదివారం సాయంత్రం రిలీజ్ అయిన సందర్భంగా మాట్లాడిన నాగ్..ఇలాంటి భక్తిరస చిత్రాల్లో నటించడం తన అదృష్టమని, పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్యానించాడు.
అటు-ఈ సినిమాలో నాగార్జున హాథీరామ్ బాబా పాత్రలో ఒదిగిపోయాడని, ప్రేక్షకులకు దేవుడి దర్శనం కావాలంటే నాగార్జున కళ్ళతో చూడాలని చమత్కరించారు రాఘవేంద్ర రావు.
ఈ చిత్రం పాటల తొలి సీడీని నాగ చైతన్య, అఖిల్ విడుదల చేశారు. ఈ ఫంక్షన్ లో అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, కీరవాణి, సౌరభ్ జైన్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









