వేంకటేశా...అది అబద్ధం కావాలి....

- January 09, 2017 , by Maagulf
వేంకటేశా...అది అబద్ధం కావాలి....

ఓం నమో వెంకటేశాయా మూవీ చేస్తున్నప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇదే నా ఆఖరి సినిమా కావచ్చునని అనేవారని, కానీ ఆ మాట అబద్ధం కావాలని అన్నాడు నాగార్జున. వెంకటేశుడ్ని ఇదే కోరుకుంటున్నా అని పేర్కొన్నాడు. రాఘవేంద్ర రావుతో తానిలా సినిమాలు చేస్తూనే ఉండాలన్నాడు.
ఓం నమో వేంకటేశాయ మూవీ ఆడియో ఆదివారం సాయంత్రం రిలీజ్ అయిన సందర్భంగా మాట్లాడిన నాగ్..ఇలాంటి భక్తిరస చిత్రాల్లో నటించడం తన అదృష్టమని, పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్యానించాడు.
అటు-ఈ సినిమాలో నాగార్జున హాథీరామ్ బాబా పాత్రలో ఒదిగిపోయాడని, ప్రేక్షకులకు దేవుడి దర్శనం కావాలంటే నాగార్జున కళ్ళతో చూడాలని చమత్కరించారు రాఘవేంద్ర రావు.
ఈ చిత్రం పాటల తొలి సీడీని నాగ చైతన్య, అఖిల్ విడుదల చేశారు. ఈ ఫంక్షన్ లో అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, కీరవాణి, సౌరభ్ జైన్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com