విస్తారా డిస్కౌంట్ ఆఫర్
- January 10, 2017
ప్రముఖ విమానయాన సంస్థ 'విస్తారా' తాజాగా తన రెండవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. సంస్థ ఇందులో భాగంగా ఎకానమీ తరగతి ప్రయాణానికి సంబంధించిన టికెట్లను రూ.899ల ప్రారంభ ధరతో ప్రయాణికులకు అందిస్తోంది. నేటి నుంచి జనవరి 12 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు జనవరి 25 నుంచి అక్టోబర్ 1 వరకు ఉన్న మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చని విస్తారా వివరించింది. ఈ పరిమిత కాల ఆఫర్ కేవలం దేశీ నెట్వర్క్కు మాత్రమే వరిస్తుందని పేర్కొంది. సంస్థ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకునే కస్టమర్లు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్స్ను పొందొచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







