ఎంజీఆర్‌ శతజయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ స్టాంపు

- January 14, 2017 , by Maagulf
ఎంజీఆర్‌ శతజయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ స్టాంపు

అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీ.రామచంద్రన్‌ శతజయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈనెల 17వ తేదీన ఎంజీఆర్‌ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పన్నీర్‌సెల్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఆర్‌ జయంతి రోజున ప్రత్యేక స్టాంపులను విడుదల చేస్తామని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 6న సీఎం పన్నీర్‌సెల్వం ఎంజీర్‌ పేరిట స్మారక నాణేలు, స్టాంపులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న కేంద్రం అందుకు అంగీకరించింది. జనవరి 17, 1917లో ఎంజీ.రామచంద్రన్‌ జన్మించారు. 1977-1987 మధ్యకాలంలో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1972లో ఆయన అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com