ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపు
- January 14, 2017
అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీ.రామచంద్రన్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈనెల 17వ తేదీన ఎంజీఆర్ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పన్నీర్సెల్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఆర్ జయంతి రోజున ప్రత్యేక స్టాంపులను విడుదల చేస్తామని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 6న సీఎం పన్నీర్సెల్వం ఎంజీర్ పేరిట స్మారక నాణేలు, స్టాంపులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న కేంద్రం అందుకు అంగీకరించింది. జనవరి 17, 1917లో ఎంజీ.రామచంద్రన్ జన్మించారు. 1977-1987 మధ్యకాలంలో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1972లో ఆయన అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







