జైల్లో ఖైదీల గ్యాంగ్ వార్, 10 మంది మృతి
- January 14, 2017
జైల్లో ఖైదీల మధ్య గ్యాంగ్ వార్లో 10 మంది హత్యకు గురయ్యారు. బ్రెజిల్లోని రియో గ్రాండే డొ నార్టెలో గల అల్కాకుజ్ జైలులో జరిగిన ఈ పాశవిక ఘటనలో ముగ్గురు ఖైదీల తలలను ప్రత్యర్థులు వేరు చేశారని అధికారులు వెల్లడించారు.
అల్కాకుజ్ జైలులో శనివారం మధ్యాహ్నం అల్లర్లు మొదలైనట్లు స్థానిక న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. కొంతమంది దుండగులు.. ప్రత్యర్థుల బ్యారక్లపై దాడి చేసి హతమార్చారని జైళ్ల కొఆర్డినేటర్ జెమిల్టన్ సిల్వా వెల్లడించారు. ఘటన జరిగిన జైలును పోలీసులు చుట్టుముట్టి అన్ని దారులను మూసివేసినట్లు తెలిపారు. జైలు లోపల ఆయుధాలతో ఉన్న దుండగులను అదుపులోకి తీసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు.
అల్కాకుజ్ జైలులో 620 మంది ఖైదీలను ఉంచడానికి సౌకర్యాలు ఉండగా.. ఇప్పుడు అక్కడ 1000 మందికి పైగా ఖైదీలున్నారు. 2015 నవంబర్లో కూడా ఈ జైలులో అల్లర్లు చెలరేగాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







