దుబాయ్ రషీద్ ఆసుపత్రిలో తొలి రోబో ఫార్మసీ
- January 14, 2017
రోబోల యుగం వచ్చేసింది. ప్రతి పనికీ సులువుగా ఉపయోగించే విధంగా రోబోలను తయారుచేసి విపణిలోకి విడుదల చేస్తున్నారు. వివిధ దేశాల్లో సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి బ్యాంకు కార్యకలాపాలు చూసే వరకు రోబోలను ఉపయోగిస్తున్నారు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్(యూఏఈ) తొలిసారిగా రోబోతో ఔషధ దుకాణాన్ని ఏర్పాటు చేయనుంది. దుబాయ్లోని రషీద్ ఆసుపత్రిలో రోబో ఔషధ దుకాణం సేవలందించనుంది. రోగులకు వైద్యులు సూచించిన మందులను ఇకపై రోబో వారికి అందిస్తుంది. ఆదివారం నుంచి ఈ రోబో ఔషధ దుకాణం అందుబాటులోకి రానుంది.వైద్యులు సూచించిన మందుల చిటీ మీద ఉండే బార్కోడ్ ఆధారంగా ఎటువంటి లోపాలు లేకుండా ఖచ్చితంగా అవే మందులను రోబో ఇస్తుంది.
దీని వల్ల మందుల పంపిణీలో ఒక్కోసారి వ్యక్తులు చేసే తప్పులను సరిచేసుకోవచ్చని యూఏఈ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. రోబో ఫార్మసీలో దాదాపు 35వేల మందులు నిల్వ ఉంటాయి. నిమిషం కంటే తక్కువ సమయంలో దాదాపు 12 మందుల చిటీలకు మందులు అందిస్తుంది. దీని వల్ల వినియోగదారులు మందులు కొనుగోలు చేసుకునేందుకు వేచి ఉండే సమయం తగ్గిపోతుంది.
దుబాయ్ హెల్త్ అథారిటీ ఈ రోబో సదుపాయాన్ని అన్ని ఆసుపత్రుల్లోకి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధునాతన సాంకేతికను ఉపయోగించుకొని సంతోషకరమైన, ఆరోగ్యమైన సమాజాన్ని రూపొందించుకునేందుకు డీహెచ్ఏ ఈ ఆలోచనను చేసింది. ఇప్పటికే యూఏఈలోని పలు ప్రాంతాల్లో రోబో సర్వీసులు ఉన్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రోబోలు ప్రయాణికులకు సాదర స్వాగతం పలకడం, మానవరహిత కారు ప్రయోగం.. ఇటువంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు దుబాయ్ వేదికైంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







