ఐసిస్ పై పోరాటానికి... తుపాకులు చేతపట్టిన మహిళలు
- January 15, 2017
బాంబు దాడులతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటానికి మహిళలు తుపాకులు చేతబట్టారు. ఉత్తర ఆఫ్గనిస్థాన్ జాజ్జాన్ ప్రావిన్స్లో ఐఎస్, తాలిబాన్ ముష్కరుల దాడుల్లో పలు కుటుంబాలకు చెందిన వారు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులను కోల్పోయిన 20 నుంచి 80 ఏళ్ళ మహిళలు తమను తాము కాపాడుకోవడంతో పాటు ఐఎస్ఐఎస్పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించారు. స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి తమకు ఆయుధాలు కావాలని కోరారు. ఇవ్వని పక్షంలో సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
దీంతో దిగివచ్చిన స్థానిక పోలీస్ అధికారి వారికి తుపాకులు, బులెట్లు ఇచ్చారు. కాగా ప్రభుత్వ అధికారులు మాత్రం దీన్ని సమర్థించడం లేదు.
ఆసక్తి ఉన్న మహిళలు ఆర్మీలో చేరితే శిక్షణ ఇస్తామంటున్నారు. అయితే ఆర్మీ తమ కుటుంబ సభ్యులను రక్షించలేకపోయిందని ఆ మహిళలు అంటున్నారు. ఎలాంటి శిక్షణ లేకపోయినా తమను తాము కాపాడుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









