ఐసిస్ పై పోరాటానికి... తుపాకులు చేతపట్టిన మహిళలు
- January 15, 2017
బాంబు దాడులతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటానికి మహిళలు తుపాకులు చేతబట్టారు. ఉత్తర ఆఫ్గనిస్థాన్ జాజ్జాన్ ప్రావిన్స్లో ఐఎస్, తాలిబాన్ ముష్కరుల దాడుల్లో పలు కుటుంబాలకు చెందిన వారు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులను కోల్పోయిన 20 నుంచి 80 ఏళ్ళ మహిళలు తమను తాము కాపాడుకోవడంతో పాటు ఐఎస్ఐఎస్పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించారు. స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి తమకు ఆయుధాలు కావాలని కోరారు. ఇవ్వని పక్షంలో సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
దీంతో దిగివచ్చిన స్థానిక పోలీస్ అధికారి వారికి తుపాకులు, బులెట్లు ఇచ్చారు. కాగా ప్రభుత్వ అధికారులు మాత్రం దీన్ని సమర్థించడం లేదు.
ఆసక్తి ఉన్న మహిళలు ఆర్మీలో చేరితే శిక్షణ ఇస్తామంటున్నారు. అయితే ఆర్మీ తమ కుటుంబ సభ్యులను రక్షించలేకపోయిందని ఆ మహిళలు అంటున్నారు. ఎలాంటి శిక్షణ లేకపోయినా తమను తాము కాపాడుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







