సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్రెడ్డి మృతి
- January 17, 2017
సీనియర్ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు శ్రీనివాస్రెడ్డి ఉయ్యూరు(56) మంగళవారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో అనారోగ్యంతో కన్నుమూశారు. సీనియర్ డైరెక్టర్ సాగర్కు శ్రీనివాస్రెడ్డిగారు సోదరుడవుతారు. ఈయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. శ్రీనివాస్రెడ్డి ఉయ్యూరు సినిమాటోగ్రాఫర్గానే కాకుండా మౌళి, సుధాకర్బాబు, సాగర్లతో కలిసి మౌళి క్రియేషన్స్ బ్యానర్పై సూపర్స్టార్ కృష్ణతో జగదేకవీరుడు, అమ్మదొంగా వంటి సినిమాలను నిర్మించారు. నిర్మాత చంటి అడ్డాలతో కలిసి శ్రీనివాస ఆర్ట్స్ బ్యానర్పై బాలకృష్ణతో పవిత్రప్రేమ, కృష్ణబాబు, వినీత్, సౌందర్యలతో ఆరోప్రాణం, పూరిజగన్నాథ్, జగపతిబాబుతో బాచి, శ్రీకాంత్ హీరోగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన మొండోడు సినిమాలను నిర్మించాచారు.
రీసెంట్గా రష్మీ గౌతమ్ ప్రధానపాత్రలో రూపొందిన `చారుశీల` సినిమాకు దర్శకత్వం వహించారు. టెక్నిషియన్గా, దర్శక నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్రెడ్డి ఉయ్యూరు మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు తెలుగు సినిమా ఇండస్ట్రీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. రేపు హైదరాబాద్లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







