232 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల హతం--మహమ్మద్ సమీర్
- September 13, 2015
ప్రసిద్ది చెందిన ద్వీపకల్పంలో మకాం వేసి మారణహోమాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులను అంతం చెయ్యడానికి ఈజిప్ట్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈజిప్ట్ సైన్యం వరుసగా నాలుగు రోజుల నుంచి ఉగ్రవాదులను అంతం చేస్తున్నారు. అమరవీరులకు నివాళి అనే పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టారు. చారిత్రక సీనాయి ద్వీపకల్పాన్ని స్థావరంగా చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఈజిప్ట్ మీద ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేస్తున్నారు. ఈజిప్ట్ సైన్యం నాలుగు రోజుల క్రితం ఈ ద్వీపాన్ని చుట్టుముట్టింది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తప్పించుకోకుండా, ఎదురు దాడులకు దిగకుండా జాగ్రతలు తీసుకుంది. శనివారం వరకు 232 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అంతం చేశారు. శుక్రవారం ఒక్క రోజే 98 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేశామని ఈజిప్ట్ సైన్యం అధికార ప్రతినిధి మహమ్మద్ సమీర్ మీడియాకు చెప్పారు. 2013లో అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ గద్దెదిగిన తరువాత ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఈజిప్ట్ లో మకాం వెయ్యడానికి విఫలయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







