ఒమన్ లో సెల్ఫీ దిగుతూ నీటిలో మునిగిపోయిన ఇద్దరు సోదరీమణులు

- January 20, 2017 , by Maagulf
ఒమన్ లో  సెల్ఫీ దిగుతూ నీటిలో మునిగిపోయిన ఇద్దరు సోదరీమణులు

మస్కట్ : ఆ ఫోటో వారికి చివరి ఫోటో అవుతుందని...వారు ఊహించలేదు...నీటి కొలను వద్ద ముచ్చటగా సెల్ఫీ దిగుదామనుకొని..అంచు వద్దకు వెళ్ళి దిగితే మరింత అందంగా వస్తుందనుకొని అందరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ దుర్ఘటన జాలం బాణీ బు ఆలీ లో జరిగిందని ఓ ఇరువురు సోదరీమణులు నీళ్లలో మునిగి గల్లంతయ్యారని రాయల్ ఒమన్ పోలీస్ ట్వీట్ చేశారు ఏసిల ప్రాంతంలో ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు నీటిలో ఒక్కసారిగా మునిగిపోయారని తెలిపారు. అక్టోబర్ 2016 లో ఇరువురు శ్రీలంక అమ్మాయిలు సలలాహ్ కు కుటుంబ  పిక్నిక్ వచ్చారు. సెల్ఫీ తీసుకొందామని ఆ శ్రీలంక అమ్మాయిలు, ఐన్ జాజిజ్  నీటి కొలను పక్కన ఫోటోలు  తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు...ఈ సమయంలో ఒక మహిళ  అకస్మాత్తుగా పడిపోయింది. ఈ కంగారులో మునిగిపోయిన ఆమె తన సోదరిని నీటిలోకి బలంగా లాగడంతో ఇరువురు మరణించారని రాయల్ ఒమన్ పోలీస్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com