'థియేటర్ ఆన్ డిమాండ్' సర్వీస్ ను ప్రారంభించిన పీవీఆర్ సినిమాస్
- January 20, 2017
మల్టిప్లెక్స్ చైన్ ఆపరేటర్ పీవీఆర్ సినిమాస్ సంస్థ థియేటర్ ఆన్ డిమాండ్ సర్వీస్ 'వీకేఏఏఓ'ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి థియేటర్ ఆన్ డిమాండ్ సేవల్లో వంద స్క్రీన్లను చేర్చనున్నట్లు పీవీఆర్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 30 స్క్రీన్స్ను చేర్చనుంది. వీకేఏఏఓ వెబ్ ప్లాట్ఫాం ద్వారా ఎవరైనా తమకు నచ్చిన సినిమాలను తమకు నచ్చిన థియేటర్లలో నచ్చిన సమయంలో వేయించుకోవచ్చు. అయితే షో వేయడానికి కనీసం 50 సీట్లు బుక్ కావాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసే స్క్రీన్లలో సగం ఇప్పటికే తమ సేవలు ఉన్న నగరాల్లో, మిగతావి కొత్త నగరాల్లో ఏర్పాటు చేస్తామని పీవీఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లి తెలిపారు. ప్రస్తుతం వివిధ భాషలు, జోనర్లలో 500 సినిమాలతో ఈ సేవలు ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







