3,000 టన్నులకు పైగా వ్యర్ధాలను బీచ్ ల నుండి తొలగింపు
- January 24, 2017
పర్యావరణానికి మేలు చేసేలా సముద్ర తీరాలలో వ్యర్ధాలను భారీగా శుభ్రపరిచే కార్యక్రమ సమయంలో 3,000 టన్నుల వ్యర్ధాలను విజయవంతంగా బీచ్ ల నుండి తొలగించారు. గత ఏడాది నవంబర్ నెల 20 వ తేదీ నుంచి జనవరి 15 వరకు రెండునెలల పాటు ఈ ప్రక్షాళన కార్యక్రమాలు కొనసాగాయి. అలాగే ఉత్తర దక్షణ సముద్ర తీరాలలో దృష్టి సారించి పేరుకుపోయిన చెత్త చెదారాలను తొలగించబడింది. బీచ్ లను శుభ్రంగా ఉంచడానికి మున్సిపాలిటీ శాఖ మరియు పర్యావరణం యొక్క ప్రణాళిక ప్రకారం గత ఏడాది నవంబర్ 20 న ప్రారంభించారు.ముఖ్యంగా వారాంతాల్లో పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే సందర్శకులు కోసం బీచ్ లను ఆహ్లాదంగా రూపొందించాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మున్సిపాలిటీ, పర్యావరణ మంత్రి హెచ్ ఇ మొహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ రుమేహి ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఇటీవల బీచ్ లు, ద్వీపాలు నుండి చమురు శుద్ధి తర్వాత మిగిలిన అవశేషాలను తొలగించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేయడం కోసం మంత్రివర్గ నిర్ణయ సంఖ్య (197) 2016 జారీ చేసింది. పర్యావరణ రక్షణ, ప్రకృతి పరిరక్షణ మరియు వన్యప్రాణుల విభాగం, మత్స్య శాఖ మరియు కతర్ పెట్రోలియం ఇతర విభాగాల సభ్యులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







