3,000 టన్నులకు పైగా వ్యర్ధాలను బీచ్ ల నుండి తొలగింపు
- January 24, 2017
పర్యావరణానికి మేలు చేసేలా సముద్ర తీరాలలో వ్యర్ధాలను భారీగా శుభ్రపరిచే కార్యక్రమ సమయంలో 3,000 టన్నుల వ్యర్ధాలను విజయవంతంగా బీచ్ ల నుండి తొలగించారు. గత ఏడాది నవంబర్ నెల 20 వ తేదీ నుంచి జనవరి 15 వరకు రెండునెలల పాటు ఈ ప్రక్షాళన కార్యక్రమాలు కొనసాగాయి. అలాగే ఉత్తర దక్షణ సముద్ర తీరాలలో దృష్టి సారించి పేరుకుపోయిన చెత్త చెదారాలను తొలగించబడింది. బీచ్ లను శుభ్రంగా ఉంచడానికి మున్సిపాలిటీ శాఖ మరియు పర్యావరణం యొక్క ప్రణాళిక ప్రకారం గత ఏడాది నవంబర్ 20 న ప్రారంభించారు.ముఖ్యంగా వారాంతాల్లో పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే సందర్శకులు కోసం బీచ్ లను ఆహ్లాదంగా రూపొందించాలని మంత్రిత్వశాఖ నిర్ణయించింది. మున్సిపాలిటీ, పర్యావరణ మంత్రి హెచ్ ఇ మొహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ రుమేహి ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఇటీవల బీచ్ లు, ద్వీపాలు నుండి చమురు శుద్ధి తర్వాత మిగిలిన అవశేషాలను తొలగించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేయడం కోసం మంత్రివర్గ నిర్ణయ సంఖ్య (197) 2016 జారీ చేసింది. పర్యావరణ రక్షణ, ప్రకృతి పరిరక్షణ మరియు వన్యప్రాణుల విభాగం, మత్స్య శాఖ మరియు కతర్ పెట్రోలియం ఇతర విభాగాల సభ్యులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









