మే 1 నుంచి రాష్ట్రంలో పాలిథిన్ సంచుల నిషేధం
- January 26, 2017
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పాలిథిన్ సంచులను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మే 1 నుంచి రాష్ట్రంలో పాలిథిన్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆవులు, ప్రకృతిని కాపాడుకోవడానికి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భోపాల్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ ఓమ్ ప్రకాశ్ కోహ్లీతో కలిసి ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...
పాలిథిన్ సంచుల వాడకం వలన ప్రకృతికి అపారనష్టం వాటిల్లుతోందని, ఆ సంచులను తినడం వలన అధిక సంఖ్యలో ఆవులు మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. పాలిథిన్ సంచుల నిషేధంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, మే 1 తర్వాత ఎవరూ వీటిని వాడేందుకు అనుమతి లేదన్నారు. గత సంవత్సవరం జైలు నుంచి తప్పించుకున్న 8మంది సిమీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులను సీఎం అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతో కీలకమైందని, ఈ నిర్ణయానికి తమ రాష్ట్రం కట్టుబడి ఉందన్నారు. మోదీ ప్రభుత్వంలో దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అనంతరం ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని చౌహాన్ ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









