మే 1 నుంచి రాష్ట్రంలో పాలిథిన్ సంచుల నిషేధం
- January 26, 2017
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పాలిథిన్ సంచులను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మే 1 నుంచి రాష్ట్రంలో పాలిథిన్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆవులు, ప్రకృతిని కాపాడుకోవడానికి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భోపాల్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ ఓమ్ ప్రకాశ్ కోహ్లీతో కలిసి ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...
పాలిథిన్ సంచుల వాడకం వలన ప్రకృతికి అపారనష్టం వాటిల్లుతోందని, ఆ సంచులను తినడం వలన అధిక సంఖ్యలో ఆవులు మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. పాలిథిన్ సంచుల నిషేధంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, మే 1 తర్వాత ఎవరూ వీటిని వాడేందుకు అనుమతి లేదన్నారు. గత సంవత్సవరం జైలు నుంచి తప్పించుకున్న 8మంది సిమీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులను సీఎం అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతో కీలకమైందని, ఈ నిర్ణయానికి తమ రాష్ట్రం కట్టుబడి ఉందన్నారు. మోదీ ప్రభుత్వంలో దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అనంతరం ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని చౌహాన్ ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







