సముద్రంలో బోల్తా పడిన ట్రక్కు గల్లంతైన ఆసియా దేశ డ్రైవర్
- January 28, 2017
రాస్ అల్ ఖైమా: ఇరవై ఏళ్ళ వయస్సు గల ఆసియా దేశానికి చెందిన ఒక డ్రైవర్ ఎమిరేట్ లోని రాస్ అల్ ఖైమాహ్ ఓడరేవులలో సరుకులు నింపే మార్గంపై ట్రక్కుని నడుపుతూ అకస్మాతుగా బాట తప్పి వాహనంతో సహా సముద్ర జలాల్లో పడి మునిగి చనిపోయాడు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, సరుకులు నింపిన కార్గో పెట్టెలను ట్రక్కులో ఎక్కించుకొని తిరిగివస్తున్న సమయంలో ఓడ వద్దకు వెళ్లే మార్గం ఓ భాగం విచ్ఛిన్నమై ట్రక్కు అమాంతంగా సముద్రంలోకి ఒరిగిపోయిందని వివరించారు.
"భారీ ట్రక్ కిందకు జారీ పడటం ఆపై స్టీరింగ్ చక్రం మధ్య బాధితుడు లోపల ఇరుక్కుపోయి సముద్రంలోనే తుది శ్వాస విడిచినట్లు షామ్ పోలీస్ స్టేషన్ వద్ద సిఐడి శాఖ అధిపతి మొదటి లెఫ్టినెంట్ మొహమ్మద్ సయీద్ అల్ షెహి చెప్పారు.కాగా,ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి పేరు ఎస్ ఎ కె గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ ని వెలుపలకు తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు , కానీ అప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఆ డ్రైవర్ అత్యంత విషాదంగా తన ప్రాణాలు పోగొట్టుకొన్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







