ఇరాక్లో చేతులెత్తేసిన మన విదేశాంగ శాఖ...
- January 28, 2017
వీసా లేనివారిని జరిమానా చెల్లించకుండా పంపించలేమంటున్న ఎంబసీ అధికారులు
మోర్తాడ్: ఇరాక్లో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణవాసులను ఇళ్లకు రప్పించడానికి చర్యలు తీసు కుంటామని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ప్రకటనకు భిన్నంగా ఇరాక్లోని మన ఎంబసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. వీసా గడువు ముగిసినా ఇరాక్లో ఉండిపోయినవారు సొంత దేశా లకు వెళ్లాలంటే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాక్లో ఉపాధి కోసం ఒక్కో కార్మికుడు రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసి వీసా పొందారు. ఇరాక్లో వర్క్ వీసా అని చెప్పి విజిట్ వీసా ఇచ్చిన ఏజెంట్లు తెలంగాణ కార్మికులను వం చించిన విషయం విదితమే.
ఇరాక్లో వర్క్ పర్మిట్, వీసా లేకుండా ఉన్నవారు రెండువేల డాలర్ల జరి మానా చెల్లించాలని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఇంటికి రావడానికి విమాన చార్జీల కోసం మరో 600 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ లెక్కన ఒక్కో కార్మికుడు రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు భరించాలి. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకు పోయిన తాము ఏజెంట్ల మూలంగా ఇరాక్లో పనిలేక పస్తులుంటున్నామని మళ్లీ ఇంటికి రావడానికి డబ్బులు చెల్లించాలనడం సమంజసంగా లేదని కార్మి కులు అంటున్నారు. ఇరాక్లో 500 మంది తెలం గాణవాసులు చట్ట విరుద్ధంగా ఉన్నారు. ఇందులో 33 మంది గల్ఫ్ తెలంగాణ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్రెడ్డి, ఇరాక్లో ఒక కంపెనీలో పని చేస్తున్న జన్నారంవాసి మాటేటి కుమార్ల చొరవతో జరిమానా చెల్లించకుండానే ఇంటికి చేరుకున్నారు. మిగిలినవారు ఇరాక్లో ఉండిపోయారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







