స్మార్ట్ వెహికిల్ ట్రయల్ రన్ పొడిగింపు..
- January 30, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), దుబాయ్ ప్రాపర్టీస్తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న అటానమస్ వెహికిల్ ట్రయల్ రన్ని, ఫిబ్రవరి 22 వరకు బిజినెస్ బేలో కొనసాగించాలని నిర్ణయించింది. ఈ వాహనానికి వస్తున్న స్పందన నేపథ్యంలో, ట్రయల్ రంగ్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. 10 సీటర్ వెహికిల్, 600 మీటర్ల లాంగ్ ట్రాక్ ద్వారా బిజినెస్ బేలో హల్చల్ చేయనుంది. 1500 మంది ఇప్పటికే ఈ వాహనంలో ప్రయాణించి, అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకున్నారు. మొదటి ట్రయల్ ఫేజ్లో వరల్డ్ డ్రేట్ సెంటర్ వద్ద, రెండో ట్రయల్ ఫేజ్లో మొహమ్మద్ బిన్ రషీద్ బౌలివార్డ్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ డ్రైవర్లెస్ వాహనం, భవిష్యత్తులో సరికొత్త సంచలనాలకు వేదికవుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో ఆరుగురు కూర్చోవడానికీ, నలుగురు నిల్చోవడానికీ అవకాశముంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈ వాహనం ప్రయాణిస్తుంది. భద్రత పరంగా అత్యంత విశ్వసనీయమైన వాహనంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అంతర్గత రోడ్లు, ముఖ్యంగా రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఈ వాహనాల వినియోగం సత్ఫలితాలనిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







