ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ఆగ్రహం..

- January 31, 2017 , by Maagulf
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ఆగ్రహం..

ఇరాన్‌ చేసిన క్షిపణి పరీక్షను ఘోరమైన ఉల్లంఘనగా ఇజ్రాయెల్‌ పేర్కొంది. దీనిపై ఇజ్రాయెల్‌ ప్రధాని మాట్లాడుతూ ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకునే విషయమై ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం అవుతున్నట్లు చెప్పారు. ఇరాన్‌ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నెతన్యాహూ తెలిపారు. ఇరాన్‌ 2015 నుంచి ఇటువంటి పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తున్నట్లు శ్వేత సౌధం వర్గాలు వెల్లడించాయి. ప్రయోగం పూర్తికాక ముందే క్షిపణిని పేల్చివేశాయని.. దీంతో అది ఎటువంటి క్షిపణో సరిగా వివరాలు తెలియలేదని పేర్కొంది. మరోపక్క ఈ పరీక్షపై ఇరాన్‌ మాట్లాడుతూ దీనిలో ఎటువంటి అణ్వాయుధాలు లేవని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com